తెలుగు అమ్మాయి అయినా తమిళనాడులో సూపర్ పాపులర్ అయ్యింది. అంజలి అచ్చ తెలుగు అమ్మాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఆమె స్వగ్రామం. ఆ తర్వాత ఆమె హీరోయిన్ అయినా తెలుగు కంటే తమిళంలో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అక్కడ హీరో జైతో ప్రేమాయణం నడపడం వీళ్లు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న టైంలో వీరిద్దరి మధ్య ఎందుకో తెలియదు కాని బ్రేకప్ అయ్యింది. ఇక ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా కార్యకలాపాలు అన్ని స్తంభించిపోయాయి.
ఈ క్రమంలోనే సినిమా వాళ్లు అందరూ హోమ్ క్వారంటైన్ పాటించడమో లేదా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి వంటలు చేయడం లేదా ఇళ్లు క్లీన్ చేసుకోవడమో చేస్తూ వస్తున్నారు. ఇక అంజలి కూడా ఇప్పుడు తన కొత్త పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తన కొత్త పార్ట్నర్ అంటే జై కాకుండా వేరే ఎవరైనానా ? అన్న సందేహాలు రావడం కామన్. కొత్త పార్టనర్ ఎవరో మనిషి కాదు ఆమె పెంపుడు కుక్క.
ఈ ఫోటోలలో తన పార్ట్నర్తో కలిసి హాట్ హాట్గా కనిపించింది. తన పెంపుడు కుక్క షిహ్ జు (పోలో)తో ఆడుకుంటూ కనిపించింది. తన పెంపుడు కుక్కను కూడా అభిమానులకు పరిచయం చేసింది. క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ క్యాప్షన్ పెట్టింది. అది అంజలి కొత్త పార్టనర్ కథ.