మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా మంది చాలామందే అభిమానులే ఉన్నారు. చిరు డైలాగులు, డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చిరంజీవి గారిని మార్గదర్శిగా తీసుకొని ఇండస్ట్రీలోకి ప్రవేశించిన వారు కూడా ఉన్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ 150 సినిమా తో హిట్ అందుకున్నారు. అలాగే ఆ తర్వాత సైరా నరసింహ రెడ్డి సినిమా కూడా మంచి విజయం సాధించింది అనే చెప్పాలి. ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత చిరు మూడో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే కదా.  ప్రస్తుతం మాత్రం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. 

 


ఇక ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ తెలియ చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి ఎవరికీ ఛాన్స్ ఇస్తారు అన్న ఈ విషయంలో ఎటువంటి స్పష్టత రావడం లేదు. తాజాగా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తర్వాతి సినిమా చేస్తున్నారని తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది అని చెప్పాలి.

 


ఇక పూర్తి వివరాల్లోకి వస్తే... ఈ సినిమా కథని పూరి జగన్నాథ్ రెడీ చేయగా చిరు వీడియో కాల్ ద్వారా కథ మొత్తం విన్నారు అని  అలాగే ఈ సినిమాకి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వహిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాపై అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా మాఫియా ఆధారంగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఇక నిర్మాత రామ్ చరణ్ కథ విన్నాక ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: