రామ్ చరణ్.. బన్నీ కంటే ముందే.. ప్రభాస్ ఊరించాడు. సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయబోతున్నామని ఆ మధ్య రాధాకృష్ణ ప్రకటించారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా వీళ్ల ఆశలపై నీళ్లు చల్లింది.

 

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా.. ప్రభాస్ 20వ సినిమా ఇది. ఆ మధ్య జార్జియా వెళ్లి.. కరోనా కారణంగా.. షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చేసింది చిత్ర యూనిట్. విదేశాల నుంచి వచ్చిన చిత్ర బృందం స్వీయ నిర్బంధంలో ఉంది. 

 

జార్జియా షూటింగ్ కు పేకప్ చెప్పగానే.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ట్వీట్ చేశాడు. దీంతో ఉగాదికి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూశారు అభిమానులు. శ్రీరామనవమి కూడా వెళ్లిపోయింది. ఎప్పుడు.. ఎప్పుడు అంటూ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారు అభిమానులు. వీటిని ఆపడానికి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ముందుకొచ్చి ప్రస్తుతం అప్ డేట్ ఏదీ ఉండదని తేల్చి చెప్పేసింది. 

ఆర్.ఆర్.ఆర్ నుంచి రామ్ చరణ్ టీజర్ రావడంతో... ప్రభాస్ నుంచి కూడా అప్ డేట్ ఎక్స్ పెక్ట్ చేశారు అభిమానులు. కరోనా కారణంగా.. ప్రస్తుతానికి సినిమా పనుల్ని పక్కన పెట్టినట్టు యూవీ క్రియేషన్స్ తెలియజేసింది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాతే అప్ డేట్ తో ముందుకొస్తామని తేల్చి చెప్పేసింది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ.. సురక్షితంగా ఉండంటి అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురై.. రకరకాల మీమ్స్ కామెంట్స్ గా పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలంటే పడి చచ్చే జనాలు లేకపోలేదు. ఇపుడు కొత్త సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన ఫ్యాన్స్ కు నిరాశనే ఎదురైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: