ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇండియన్ సినిమాలో కేజిఎఫ్ చిత్రం ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు గాని నిర్మాత గాని ఆ సినిమా ఆ స్థాయిలో విజయం సాధిస్తుంది అని ఊహించి ఉండకపోవచ్చు. ఆ సినిమా ఇప్పుడు రెండో భాగం రెడీ అవుతుంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుంది. ఆ సినిమాను ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల విడుదల చేసారు. అలాగే యష్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఒక లుక్ వచ్చింది. 

 

దానికి కూడా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇక్కడి నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇమేజ్ బాగా పెరిగింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అతను ఎక్కువగా బాలీవుడ్ లేదా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యాలని చూసాడు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో స్పష్టత రావడం లేదు. కేజిఎఫ్ తర్వాత అతను ఏ ప్రాజెక్ట్ చేస్తాడు అనేది అర్ధం కావడం లేదు. అతను కేజిఎఫ్ 3 కూడా తీస్తాడని వార్తలు కూడా వస్తున్నాయి. దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. 

 

అయితే అతనితో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన ఇప్పటికే ప్రశాంత్ తో మాట్లాడి తనతో ఒక యాక్షన్ సినిమాను ప్లాన్ చెయ్యాలని కూడా కోరినట్టు సమాచారం. కరణ్ జోహార్ ఆ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ సినిమా ఆవిషయంలో ప్రశాంత్ ఏ నిర్ణయానికి ఇంకా రాలేదని అంటున్నారు. దాని మీద త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: