టాలీవుడ్ లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. నిర్మాతలు అయినా హీరో లు అయినా సరే ఆయనతో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించే వారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయినా సరే ఇప్పుడు మాత్రం ఆయనకు అంత ప్రాధాన్యత లేదని ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకి రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా పూరి కథల విషయంలో అభిమానులు అంత ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. 

 

దీనికి కారణం ఆయన కథలకు అంత పట్టు లేకపోవడం ఎప్పుడు కూడా ఒకే జోనర్ లో ఆయన సినిమాలు చేస్తున్నారని హీరో ఏ విధంగా ఉంటున్నాడో ప్రతీ సినిమాలో అదే విధంగా హీరో పాత్ర ఉంటుందని అందుకే ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని టాక్ వినపడుతుంది. ఒకప్పుడు పూరి తో సినిమా చేసిన హీరోలు కూడా ఇప్పుడు ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం, నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదు. 

 

దీనికి కారణం ఆయన ఎంచుకునే కథలే అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని స్టార్ హీరోలు అయితే అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. కథ విషయంలో కొందరు దర్శకులు తీసుకునే జాగ్రత్తలు కూడా పూరి తీసుకోవడం లేదని కొందరు నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన్ను హీరోలు కూడా వద్దు అంటున్నారని అంటున్నారు. అగ్ర హీరోలు అయితే అసలు పూరి కథలను వినే ప్రయత్నం కూడా చేయడం లేదని మహేశ్ బాబు తో అతను సినిమా చెయ్యాలని చూసినా సరే అందుకు మహేష్ ఓకే చెప్పలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: