టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా వెండి తెరకు పరచయం అయ్యారు. కెరిర్ బిగినింగ్ లో విలన్ గా నటించినా తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలు అందుకున్నాడు. గత కొంత కాలంగా గోపిచంద్ కి ఏ మూవీలు కలిసి రావడం లేదు. గత ఏడాది చాణక్య మూవీతో మంచి విజయం అందుకున్నాడు. లౌక్యం మూవీ గోపిచంద్ కి మంచి పేరు తెచింది. ఫుల్ లెన్త్ కామెడీతో సూపర్ హిట్ అందుకుంది. ఆ స్థాయిలో మంచి కామెడీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు గోపిచంద్. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ కామోడీ తరహా మూవీలో కూడా మంచి పేరు సంపాదించడు.
తెలుగులోని యాక్షన్ హీరోల్లో గోపీచంద్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. చాలా వరకు గోపిచంద్ మూవీస్ లో రొమాన్స్, కామెడీ తక్కువగానే ఉంటుంది.. కానీ లౌక్యం తర్వాత తన మూవీస్ లో కామెడీ ఎక్కువగా ఉండేలా చూస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 'సీటీమార్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా మొదటి సారి నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు.
కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ - వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం నవ్విస్తుందని అంటున్నారు. గతంలో శౌర్యం మూవీలో అలీ - గోపిచంద్ మద్య కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. సీటీమార్ మూవీలో సెకండాఫ్ కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గతంలో 'గౌతమ్ నంద' సినిమాతో పరాజయాన్ని చూసిన సంపత్ నంది - గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతారేమో చూడాలి.