అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చినా అల్లు అర్జున్ మెగా హీరోనే. రీసెంట్ గా అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కెరీర్ 17ఏళ్లలో తొలి ఇండస్ట్రీ హిట్ (నాన్ బాహుబలి) సాధించాడు. ఆ ఉత్సాహంలో ఉన్న బన్నీ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథకు రీసెంట్ గా రిలీజ్ చేసిన బన్నీ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

 

ఈ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లార్జ్ స్కేల్ లో తెరకెక్కించడం కరెక్టేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కథకు అంత స్కోప్ ఉందా అని వాదనలు కూడా వస్తున్నాయి. అయితే.. సినిమా కథ అడవి, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ స్మగ్లింగ్ కు ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో బాగా జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఇక కర్ణాటక, కేరళలో కూడా అటవీ ప్రాంతం ఎక్కువే. ఫారెస్ట్ నేపథ్యం ఉన్న మాస్ సినిమాలకు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా చూస్తారు.

 

 

హిందీలో ఫారెస్ట్ నేపథ్యాన్ని బాగానే ఆదరిస్తారు. కావలిసిందల్లా సినిమా రిచ్ గా ఉండడమే. ఇటివల తెలుగు సినిమాలకు యూట్యూబ్ లో ఆదరణ బాగా ఉంటోంది. తెలుగు సినిమాల రీమేక్ రైట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. బన్నీ అల.. వైకుంఠపురములో కూడా మంచి రేట్ కు అమ్ముడుపోయింది. ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్య బన్నీ - సుకుమార్ తీసుకున్న డెసిషన్ సరైనదే అని చెప్పాలి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: