పంజాబీ భామ ఛార్మి గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట మన తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తరువాత కొన్నాళ్ళకు సడన్ గా ప్రొడ్యూసర్ గా అవతారమెత్తింది. అయినప్పటికీ కూడా అదే వన్నె తరగని అందంతో తన ఫ్యాన్స్ ని ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది. ముందుగా నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్ లో ప్రారంభం అయిన ఛార్మి నట ప్రస్థానం, ఆ తరువాత మధ్యలో కొన్ని చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాల అవకాశాలు కూడా దక్కించుకుంటూ మెల్లగా ముందుకు సాగింది. అయితే వాటిలో కొన్ని మంచి విజయాలు అందుకోగా, మరికొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి. 

 

అయినప్పటికీ కూడా అవన్నీ పెద్దగా లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిన ఛార్మి, ఆపై కొంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధం అయింది. అనంతరం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మంత్ర సినిమా అప్పట్లో మంచి హిట్ కొట్టి, నటిగా ఛార్మికి మరింత మంచి పేరు తీసుకువచ్చింది. అయితే అదే తరహా సినిమాల్లో ఆపై ఆమె నటించినప్పటికీ, అవి మాత్రం ఆమెకు పెద్దగా సక్సెస్ ని అందివ్వలేదు. ఇక ఆ తరువాత నుండి అక్కడక్కడా ఆమె కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించడం జరిగింది. అయితే అవి కూడా ఛార్మికి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కాగా వాటి అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మి సినిమాలో మెయిన్ రోల్ పోషించడంతో పాటు తొలిసారిగా ఆ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి, అప్పటి నుండి ఇప్పటివరకు పూరి తీస్తున్న సినిమాలంనాటికీ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోంది. 

 

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి పూరి తీస్తున్న ఫైటర్ కి కూడా ఆమె సహ నిర్మాతగా పని చేస్తున్నారు. ఇకపోతే ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన విషయాలు షేర్ చేసుకునే అలవాటున్న ఛార్మి, ఇటీవల మాల్దీవ్స్ కు వెళ్లిన సమయంలో దిగిన రెండు ఫోటోలను నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న ఛార్మిని చూసి, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, మాలో అలజడి రేపింది నీ చిరునవ్వు అంటూ కొందరు ఫ్యాన్స్ సరదాగా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: