యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న స్టామినా స్టార్ డం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు బాహుబలి క్రేజ్ తో సాహో' సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటే సాహో తో వచ్చిన క్రేజ్ నాలుగింతలు అని చెప్పాలి. కానీ నిర్మాతలు ఆశించినంత గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేదు. 

 

ఇక తాజాగా సినిమా బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఐనా కూడా ఇంకా బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి సిద్దంగా ఉన్నట్టు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తామని అంటున్నారట. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఏమాత్రం బడ్జెట్ విషయంలో రాజీపడకుండా నిర్మిస్తున్నట్లుగా సమాచారం. సాహో రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా జాన్ సినిమాని రూపొందించాలని పక్కాగా ప్లాన్ లో ఉన్నారట యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. కరోనా కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చినా ఈ సినిమా ని పరిస్థితులు చక్కబడగానే షూటింగ్ మొదలు పెడతారట. అందుకోసం ఇక్కడే సెట్స్ కూడా సిద్దం చేశారట.

 

అయితే గత కొన్నాళ్ళుగా బాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో భారీ స్థాయిలో సినిమాని నిర్మించడానికి సిద్దంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం కూడా ఉందని ప్రభాస్ సన్నిహితులు కూడా చెప్పారట. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ప్రభాస్ ని సంప్రదించారు కూడా. కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయడానికి ఆసక్తిగా లేరన్న మాట వినిపించింది. తెలుగులో మరో రెండు మూడు భారీ హిట్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు కావాలంటే ఆ సినిమాలనే హిందీలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నట్టు తెలిసింది. అయితే కరోనా తో ప్రపంచం మొత్తం భారీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ ఆసక్తి చూపించినా బాలీవుడ్ లో నిర్మాతలు ప్రభాస్ తో సినిమా నిర్మించడానికి రెడీ కాకపోవచ్చునన్న టాక్ మొదలైందట.     

మరింత సమాచారం తెలుసుకోండి: