సినిమా వాళ్ళు ఏది చేసినా సరే జనాలకు ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు జనాలు. వాళ్ళ గురించి ఏ వార్త వచ్చిన వాళ్ళు ఏది మాట్లాడినా సరే వీళ్ళకు అదో ఆసక్తి. మీడియా కూడా వాళ్ళ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రతీ చిన్న విషయాన్ని హైలెట్ చేస్తూ వాళ్ళను ఎక్కువగా వార్తల్లో ఉంచుతుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎం చేసినా సరే అది పెద్ద వార్త అవుతుంది ఈ మధ్య, 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు రష్మిక మందన కొత్త బిజినేస్ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆమె బ్యూటి పార్లర్స్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు. బెంగళూరు లో ముందు మొదలు పెట్టి అది విజయవంతం అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె సొంత రాష్ట్ర౦ కర్ణాటక. కాబట్టి ముందు అక్కడి నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో పాప ఉందని టాలీవుడ్ జనం అంటున్నారు. 

 

ఆమె ఇప్పటికే మరో సీనియర్ హీరోయిన్ దగ్గర దీనికి సంబంధించిన సలహాలను కూడా తీసుకుంది అంటున్నారు. ఇందుకోసం ముందు రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఆలోచనలో రష్మిక ఉందని సమాచారం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దసరా తర్వాత మాత్రం ఈ బ్యూటి పార్లర్ ని ఆమె మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఓపెనింగ్ కి మాంద్యా ఎంపీ సుమలత ను పిలుస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: