గ్యాప్ ఇచ్చి  సినిమాలు చేస్తున్న ప్రభాస్ మీద ఫ్యాన్స్ అందరూ అలిగితే.. డార్లింగ్స్ ..ఈ సారి మాత్రం ఇంత గ్యాప్ ఇవ్వను.. ప్రతి సంవత్సరం సినిమా చేస్తాను అంటూ తన డైహార్డ్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు ప్రభాస్‌. కానీ ఈ సంవత్సరం ప్రభాస్ ప్రేక్షకుల ముందుకొచ్చేఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

 

అయితే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. జాన్ సినిమా మాత్రం అంతకంతకూ డిలే అయిపోతోంది. రెండేళ్లకో సినిమా చేస్తున్నప్రభాస్ ని చూసి డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి సంవత్సరానికో సినిమా చేస్తానని చెప్పాడు . కానీ లాస్ట్ ఇయర్ సాహో తో వచ్చిన ప్రభాస్ ఈ సంవత్సరం జాన్ సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ కనిపించడంలేదు. అప్పుడెప్పుడో 2015 లో బాహుబలి 1, 2017 లో బాహుబలి 2 చేశాడు. మళ్లీ 2019 లో సాహో సినిమా చేశాడు. మళ్లీ 2020 లో థియేటర్లలో మిస్ అవుతున్నాడు.

 

ఎలా అయినా సరే ఈ సంవత్సరమే జాన్ సినిమా రిలీజ్ చేద్దామని జార్జియా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తో ఎలా వెళ్లారో అంతే స్పీడ్ గా రిటర్న్ అయ్యారు రాధాకృష్ణ అండ్ టీమ్. ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు, ఎప్పుడూ అవుట్ డోర్ షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తారో తెలీదు. అందుకే ప్రభాస్ ఎప్పుడూ లేటే అనుకున్న టైమ్ కి రాడు అని డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ జోతీష్యుడిగా కనిపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్ పెద నాన కృష్ణంరాజు గోపీ కృష్ణా మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: