తమిళంలో మన హీరోలను ఆదరించినా లేకపోయినా సరే తెలుగులో మాత్రం తమిళ హీరోలకు మన వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాళ్లకు ఎక్కువగా మన వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు. వాళ్ళను ఎక్కువగా అభిమానిస్తూ వాళ్ళ సినిమాలకు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. నలుగురు హీరోలకు మాత్రం ఇక్కడ ప్రాధాన్యత చాలా ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సూర్య, కార్తీ, అజిత్, విశాల్, రజని కాంత్ సినిమాలకు ఎక్కువగా ఇక్కడ మార్కెట్ ఉంటుంది. రజని కాంత్ ని పక్కన పెడితే, 

 

మిగిలిన హీరోల సినిమాలకు ఎక్కువగానే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమిళ హీరోలు ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వాళ్లకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి తెలుగులో ఎక్కువగా సినిమాలను చెయ్యాలని చూడటం గమనార్హం. ఒక అగ్ర హీరో అయితే ఏకంగా తానే దర్శకుడి గా ఒక సినిమాను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇక్కడి స్టార్ నిర్మాతను కూడా ఆయన కలిసినట్టు సమాచారం. ఇక్కడ పండగలకు ఎక్కువగా మార్కెట్ ఉంటుంది. 

 

చిన్న సినిమా విడుదల అయినా సరే ఇక్కడి అభిమానులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆ హీరో మన వైపు చూస్తున్నారు. అలాగే ఇక్కడి హీరో ని అక్కడ ప్రమోట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మన హీరో కి అక్కడ ఫాలోయింగ్ ని పెంచే కార్యక్రమం తాను చేస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కథను ఇప్పటికే దాదాపుగా సిద్దం చేసుకుని సినిమాను విడుదల చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. మార్కెట్ ని టార్గెట్ చేసారు అని మాత్రం అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: