పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే పవర్ ఫ్యాన్స్, పవనిజం.. ఇప్పుడు జనసైనికులుగా కూడా మారిపోయారు. వీరంతా మెగా హీరోలకు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు. సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన ‘చెప్పను బ్రదర్’ అనే డైలాగ్ తో పవన్ ఫ్యాన్స్ కు దూరమయ్యాడు. బన్నీపై తీవ్ర వ్యతిరేకత కూడా చూపారు. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ కు బన్నీ చేరువ కావడంతో గొడవలు కాస్త సద్దుమణిగాయి. ఇప్పుడు రీసెంట్ గా మళ్లీ పవన్బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైనట్టే కనబడుతోంది.

 

 

బన్నీ తన పుట్టినరోజు జరుపుకున్న ఏప్రిల్ 8నే పవన్ కల్యాణ్ కుమారుడు అకిరానందన్ పుట్టినరోజు కూడా. అకీరా పుట్టినరోజు సందడి సోషల్ మీడియాలో మోగిపోయింది. సోషల్ మీడియాలో హ్యాష్ తో రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే అకీరాకు బన్నీ మాత్రం విసెష్ చెప్పలేదు. అదే రోజు పుట్టిన రోజు జరుపుకున్న అక్కినేని అఖిల్ కు మాత్రం ట్విట్టర్ వేదకగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ మళ్లీ బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ కు విసెష్ చెప్పి అకీరాను కనీసం పట్టించుకోకపోవడంతో నెట్టింట్లో బన్నీపై విమర్శలు మళ్లీ పెరిగిపోయాయి.  

 

 

మెగా హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ కొంత కాలం క్రితం చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో చీలిక తెచ్చాయి. ఈ చీలకకు బన్నీనే ఆమధ్య ఫుల్ స్టాప్ పెట్టాడు. ఫిలింనగర్ కార్యాలయంలో పవన్ ను కలవడం, ఎన్నికల ప్రచారంలో పవన్ కు మద్దతుగా నిలవడంతో ఫ్యాన్ వార్ కు తెర పడింది. కానీ.. బన్నీ మళ్లీ ఈ వార్ కు ఆజ్యం పోస్తున్నట్టున్నాడు. అకీరాకు విసెష్ చెప్పకపోవడంతో పవన్బన్నీ ఫ్యాన్ మళ్లీ స్టార్ట్ అవుతుందా లేదా చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: