ఇప్పుడు సినిమాల మార్కెట్ అనేది భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సినిమాల మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలోనే ఇప్పుడు చాలా మంది సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎక్కువగా సినిమా మార్కెట్ మీదే చాలా మందికి ఆశలు ఉన్నాయి. సినిమా మార్కెట్ పెరిగుతుంది కాబట్టి ఇప్పుడు దర్శకులు నిర్మాతలు గా మారుతున్నారు. హీరోలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు క్రికెటర్ లు కూడా సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. 

 

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సినిమాలో పెట్టుబడి పెట్టాలని ఒక నిర్మాణ సంస్థను స్థాపించాలి అని భావిస్తున్నాడు. తనకు సినిమా నిర్మాతగా మారాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉందని అందుకే సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడని సమాచారం. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కావడం లేదని ఇప్పుడు తన భార్యతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా ఎవరి తో చేసే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. అయితే సల్మాన్ ఖాన్ తో అని అంటున్నారు. 

 

సల్మాన్ ఇప్పుడు విరాట్ తో సినిమా చేయడానికి రెడీ కూడా అయినట్టు తెలుస్తుంది. గతంలో వీరి మధ్య అనుష్క శర్మ కారణంగా విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు అది నిజం కాదని అంటున్నారు. అనుష్క శర్మ కూడా కోహ్లికి సహాయం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే తన మేనేజర్ కి కోహ్లి కొన్ని సలహాలను కూడా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ మాత్రం ఒక్కడే పెట్టకుండా మరో నిర్మాతతో కలిసి పెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: