ప్ర‌స్తుతం క‌రోనాతో అంద‌రూ లాక్‌డ‌వున్‌లో ఉంటున్నారు. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దాంతో ఒకొక్క‌రూ ఒక్కో ప‌నిలోప‌డ్డారు. అయితే చాలా మంది ఫోన్లు మాట్లాడుతూ కాల‌క్షేపం చేస్తున్నారు. కొంత మంది ఫోన్ల‌తో మ‌రికొంత మంది ఎక్కువ సేపు నిద్ర‌పోతూ.. ఇంకొంత‌మంది ఫ్యామిలీతో క‌లిసి వెరైటీ వంట‌లు వండుకోవడం ఇలా ర‌క ర‌కాల ప‌నుల‌తో బిజీగా ఉంటున్నారు. మ‌రి డార్లింగ్ హీరో ప్ర‌భాస్ అయితే మాత్రం అనుష్క‌, రానాతో క‌లిసి వీడియో కాల్ మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తుంటే ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఇప్పుడు తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నార‌ట‌.  

 

భార్యా పిల్లలతో క్వాలిటీ టైం గడుపుతున్న తారక్  అంతేకాక ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని కూడా ఏమాత్రం నెగ్‌లెక్ట్ చెయ్య‌కుండా పనిలో పనిగా దర్శకుల నుండి కథలు కూడా వింటున్నారట. ఇప్పటికే తన 30వ చిత్రం త్రివిక్ర‌మ్‌తో ప్రకటించేసిన ఆయన కొందరు దర్శకుల నుండి కథలు వింటూ త‌న 31వ చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక ఎన్టీఆర్ 31వ చిత్రం కొరటాల శివతో ఉంటుందని  ప్రచారం జరుగుతున్నా ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు.

 

ఇక ఇదిలా ఉంటే... మ‌రి కొర‌టాల మాత్రం చిరంజీవి చిత్రం త‌ర్వాత ఇక సినిమాలు చెయ్య‌ర‌ని ఓ వెబ్‌సైట్‌లో వార్త వ‌చ్చింది. మ‌రి అది ఎంత వ‌ర‌కు నిజం అన్న విష‌యం తెలియాల్సి ఉంది. తన ఇమేజ్ కి తగ్గ మంచి కథ తీసుకువచ్చిన దర్శకుడితో కమిట్ కావచ్చనే ఉద్దేశంతో ఎన్టీఆర్ దర్శకుల నుండి కథలు వింటున్నాడని సమాచారం. ఇక ఆర్.ఆర్.ఆర్ కారణంగా ఎన్టీఆర్ అభిమానులు ఆయనని స్క్రీన్ పై రెండేళ్లు మిస్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కానుంది. మ‌రి ఆ చిత్రం అవ్వ‌గానే మ‌రో చిత్రం ప‌ట్టాల‌మీద‌కి ఎక్కించాల‌ని తెగ సీరియ‌స్‌గా క‌థ‌లు వింటున్నాడు ఎన్టీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: