ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తాజాగా "రంగ మార్తాండ" అనే సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరాఠీ భాషలో మంచి హిట్ సాధించిన నటసామ్రాట్ కి రీమేక్ గా ఈ సినిమా తీస్తున్నారని కృష్ణవంశీ తెలిపారు. ఇక గతంలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన నక్షత్రం సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి డైరెక్టర్ కృష్ణవంశీ రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఉండే విధంగా సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ చూపించడానికి నక్షత్రం సినిమా షూటింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.

 

 

ఇక చాలా విరామం తర్వాత కృష్ణవంశీ చాలా కథలను విన్నారు. కానీ అవేవి కృష్ణవంశీకి నచ్చకపోవడంతో మరాఠీ భాషలో సూపర్ హిట్ దక్కించుకున్న సినిమాను రూపుదిద్దాలని అని కృష్ణవంశీ నిర్ణయం తీసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ, బిగ్ బాస్ త్రీ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలలో ఈ సినిమాలో నటిస్తున్నారు.

 


ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవడం కూడా జరిగింది. కృష్ణవంశీ ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఇదిలావుండగా మరోవైపు అనుష్క నిశ్శబ్దం, నాని v, పవన్ కళ్యాణ్ " వకిల్ సాబ్" సినిమాలు పోటీగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమాని పూర్తిచేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అంటే కాస్త కష్టమైన పని అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు అని కృష్ణవంశీ తెలిపారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంతపురం సినిమా మ్యూజిక్, పాటల కలయికతో మంచి బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా కూడా ఆ తరహాలో ఉంటుందేమో అని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: