ఎవరు ఎన్ని చెప్పినా సరే టాలీవుడ్ లో మార్కెట్ బాగా పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో భారీగా వసూళ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు కూడా ఇదే ట్రెండ్ ఉంది. వసూళ్లను టార్గెట్ చేసి... ఇప్పుడు దర్శకులు అయినా హీరోలు అయినా నిర్మాతలు అయినా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఇది వరకు ఉండేది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో కూడా మొదలయింది. దీనితో కొందరు ఇక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టే ప్రయత్నాలు బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా చేస్తున్నారు. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఇక్కడి సినిమాలు కమర్షియల్ గా వస్తున్నాయి కాబట్టి ఇక్కడి సినిమాలను బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తే అక్కడ తమ మార్కెట్ పెరిగితే తమకు లాభం ఉంటుంది అనే భావనలో హీరోయిన్స్ ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగు మీద బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా దృష్టి పెట్టారని టాలీవుడ్ జనం అంటున్నారు. అక్కడి నిర్మాతలు కూడా ఇక్కడి సినిమాలను ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. 

 

ఇక్కడ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో తీసుకుని వెళ్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఇక్కడి స్టార్ హీరోల సినిమాలను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ ఇక్కడి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడి దర్శకులతో కూడా ఇప్పటికే మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పడం తో భవిష్యత్తులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు ఆ ఇద్దరు హీరోయిన్ లు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: