మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఊపులో లేడు అనే చెప్పాలి. మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంట్రీ ఇచ్చిన బాస్ తనదైన శైలిలో మెగా అభిమానులు అందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. అంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా పేరు 'ఆచార్య' అని బయట పెట్టేసిన చిరు తర్వాత చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు లీక్ చేశాడు. అసలు చిరు ఇదంతా తెలిసి చేస్తున్నాడా లేదా హైప్ కోసం చేస్తున్న ఒక ప్లానా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

 

ఇలాంటి సమయంలో చిరంజీవి మళ్ళీ ఇంకొక విషయాన్ని వెల్లడించాడు. అప్పట్లో మలయాళం సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్ తెలుగు' రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకోవడం జరిగింది. చిత్రాన్ని చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి రీమేక్ చేస్తున్నారని అంతా భావించారు. అయితే ఎవరి దగ్గర నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో విషయాన్ని లైట్ తీసుకున్నారు.

 

కానీ అనూహ్యంగా చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిత్రంలో తాను నటిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా సాహో సినిమాకి దర్శకత్వం వహించిన యువ డైరెక్టర్ సుజిత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు కూడా పేర్కొన్నాడు. తన రెండవ చిత్రమే సాహో లాంటి పెద్ద ప్రాజెక్టు చేపట్టిన సుజిత్ ఇప్పుడు లూసిఫర్ తెలుగు రీమేక్ కి సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.

 

ఒక యువ దర్శకుడిని నమ్మి చిరు అంతటి స్టార్ ప్రాజెక్టు ఇవ్వడం రిస్క్ అయినా.... చిత్రం మాత్రం మన నేటివిటీకి తగ్గట్లు సరిగ్గా తీస్తే బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పండించుకోవచ్చు. మరి సుజిత్ సినిమాని తెలుగులో ఏవిధంగా చూపిస్తాడో చూడాలి. మలయాళంలో లూసిఫర్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. సినిమాలో మోహన్ లాల్ నటనకు థియేటర్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: