యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరు కలిసి అరవింద సమెత వీర రాఘవ సినిమా చేశారు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ కు హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ చేసిన అల వైకుంఠపురములో ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. అల సినిమా తర్వాత మరోసారి త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా అయినను పోయి రావలె హస్తినకు ప్రచారంలో ఉంది. 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు. సినిమాలో కొమరం భీమ్ చేస్తున్నాడు తారక్. 2021 జనవరి 8 రిలీజ్ అని ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం తారక్, చరణ్ ఇద్దరు వాళ్ళ డేట్స్ ఇచ్చేశారు. 2020 లో వీళ్లిద్దరు వేరే సినిమా చేసే అవకాశం లేదు. అందుకే త్రివిక్రమ్ తో సినిమా కొద్దిగా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. తారక్, త్రివిక్రం ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది. 

 

అయితే తారక్ ఫ్రీ అయ్యే వరకు త్రివిక్రమ్ ఖాళీగా ఉండాలి. అందుకే ఎన్టీఆర్ సినిమాకు ముందే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం త్రివిక్రమ్ తారక్ బదులుగా మహేష్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ అతడు, ఖలేజా రెండు సినిమాల్లో ఒకటి హిట్టు రెండోది యావరేజ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కోసం సిని లవర్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు కానీ అది వర్క్ అవుట్ అవలేదు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో మహేష్ సినిమా గురించి నమ్రత చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. 

 

అదే నిజం అయితే మరోసారి ఈ కాంబో మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. పవన్ తర్వాత త్రివిక్రమ్ స్నేహితుల లిస్ట్ లో ఉన్న మహేష్ తో సినిమాకు తాను ఎప్పుడు రెడీ అని అప్పట్లో చెప్పిన మాటల మాంత్రికుడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: