సెల‌బ్రిటీలు.. ఏం చేసినా కొత్త‌గానే ఉంటుంది. ఇదే స‌మ‌యంలో హీరోలు, హీరోయిన్ల గురించి తెలుసుకోవ‌డానికి జ‌నం కూడా ఎప్పుడూ పోటీప‌డుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు క‌రోనా కాలం.. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌. దీంతో సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. కొంద‌రు హీరోలు, హీరోయిన్లు ఇంటి ప‌నులు చేస్తూ ఆ వీడియోల‌ను, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ర‌క‌ర‌కాల ప్ర‌యోగాల‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధానంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే క‌త్రీనా కైఫ్‌, త‌దిత‌ర హీరోయిన్లు ర‌క‌ర‌కాల ఫీట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. అలాగే ప‌లువురు హీరోలు కూడా వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల‌ను సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా.. ప్ర‌ముఖ హీరోయిన్ శ్రియ కూడా త‌న భ‌ర్త‌తో క‌లిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. క‌రోనాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. ఈ మేర‌కు ఆమె ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

 

శ్రియ‌, ఆమె భ‌ర్త ఆండ్రూ కొశ్చివ్ వీడియో నెటిజ‌న్లు బాగా ఆక‌ట్టుకుంటోంది. * రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్న వారంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు* అని రాసి ఉన్న ప్ల‌కార్డుని ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా.. ఆమె భ‌ర్త కూడా వెనుక నిల్చొని మ‌రో ప్ల‌కార్డుని చూపిస్తున్నాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే వారంద‌రికీ సెల‌బ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే శ్రియ కూడా వారి సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. కాగా, 2018లో శ్రియ ర‌ష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా శ్రియ సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ఆమె పైసా వ‌సూలు, గాయ‌త్రి త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: