టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శకులు పోటీ పడుతూ ఉంటారు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇతర సినిమాలను కూడా పక్కన పెట్టే దర్శకులు ఉన్నారు. నిర్మాతలు కూడా అదే స్థాయిలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో వచ్చే అవకాశం ఉంది. 

 

సినిమా తర్వాత అతను కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది ఎవరికి స్పష్టత లేదు. దీనితో వచ్చే ఏడాది ప్రశాంత్ తో చేసే సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టాలి అని భావిస్తున్నాడు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది... ఈ సినిమా కు సంబంధించి షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే కథ కూడా విన్నాడని సమాచారం. 

 

ఆ కథ పూర్తిగా నచ్చడం తోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అన్నీ పరిశీలించిన తర్వాతే ఈ సినిమాను ముందుకి తీసుకుని వెళ్ళే ఆలోచన ఎన్టీఆర్ చేస్తున్నాడని నిర్మాత తన అన్న కళ్యాణ్ రామ్ తో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: