పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా అనగానే టాలీవుడ్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. అందుకే ప్రతీ చిన్న విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తన సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. 

 

పవన్ కళ్యాణ్ కంటే ముందు మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అని భావించినా సరే ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్ అంతగా ఆసక్తి చూపించలేదు అంటున్నారు. ఆ సినిమాను పక్కన పెట్టి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి పవన్ రీ ఎంట్రీ సినిమా త్రివిక్రమ్ తోనే చెయ్యాలి అని భావించినా సరే కొన్ని కారణాల కారణంగా అది వాయిదా పడింది. అందుకే ఇప్పుడు ఆ సినిమాను ఎన్టీఆర్ తో చేసే సినిమా తర్వాత సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన త్రివిక్రమ్ చేస్తున్నట్టు సమాచారం. 

 

కథ ఎప్పుడో రెడీ అయినా సరే ఈ కారణాలతోనే అది వాయిదా పడింది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా కథను ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కి కూడా వినిపించారని హారిక అండ్ హాసిని బేనర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది మే లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి నిజమో కాదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: