రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ఎందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్న కన్నడ డబ్బింగ్ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా ఎంతో భారీగా తెరకెక్కిన ఆ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫీల్ తో ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిన ఆ సినిమా, రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు కొనసాగింపుగా కెజిఎఫ్ చాప్టర్ 2 ని తీస్తున్న ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా విషయమై కొద్దిరోజులుగా మన టాలీవుడ్ లో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 
 

ముందుగా అప్పట్లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయినట్లు వార్తలు కూడా రావడం జరిగింది.వాస్తవానికి ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూ లో ప్రముఖ నిర్మాణ సంస్థైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఒప్పందం ఉందని, అయితే ఆ సినిమాని ఎన్టీఆర్ గారితో చేస్తారా లేక మరొక స్టార్ హీరోతో చేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని అన్నారు. ఇక దాని తరువాత ప్రశాంత్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని కలిసి ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ వినిపించడం జరిగిందని, ఆ స్టోరీ నచ్చిన మహేష్ అతి త్వరలో సినిమా చేద్దాం అని మాటిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. 

 

అయితే దానిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా వినపడుతున్న వార్తలను బట్టి చూస్తుంటే ప్రస్తుతం జాన్ సినిమా చేస్తున్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాతో చేయనున్నారు. ఇక వీటి అనంతరం ఆయన ప్రశాంత్ నీల్ తో పని చేయనున్నారని, ఈమేరకు ఇటీవల ఒక భారీ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగ వార్తే అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: