తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు స్టార్ హీరో మాత్రమే కాదు.. ఇండస్ట్రీ పెద్ద అనే హోదాకు అతి దగ్గరలో ఉన్నాడు. ఇటివల సోషల్ మీడియాలో కూడా తన హోదాకు తగ్గట్టుగా కరోనా గురించి జాగ్రత్తలు చెప్తున్నాడు. అయితే.. తన సినిమాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండలేక నోరు జారుతూ విమర్శలకు గురవుతున్నాడు. సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిన సినిమా వివరాలు పబ్లిగ్గా ఒకొక్కటి రివీల్ చేసేస్తూ విమర్శలకు గురవుతున్నాడు.

 

 

షూటింగ్ దశలో ఉన్న తన 152వ సినిమా టైటిల్ ను ‘ఆచార్య’గా తన నోరు జారుడు కారణంగా పబ్లిక్ లో అనౌన్స్ చేసేశాడు. నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ వరకూ ఈ విషయంలో తల పట్టుకున్నారు. ఇప్పుడు సినిమాలో కీలకంగా మారిన ఓ క్యారెక్టర్ విషయాన్ని కూడా రివీల్ చేసేశాడు. చరణ్ నటిస్తాడని చెప్తున్న క్యారెక్టర్ వివరాలు కూడా ఆ మధ్య ఓ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పేశాడు. ఆ క్యారెక్టర్ కు తనకు సంబంధం ఉండదని కీలకమైన పాయింట్ చెప్పేసి సస్పెన్స్ లేకుండా చేసేశాడు. చూస్తుంటే కరోనా క్రైసిస్ గ్యాప్ లో చిరంజీవే మొత్తం కథ చెప్పేసేలా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.

 

 

వయసు రీత్యా వచ్చిన చాదస్తమా లేక అత్యుత్సాహమా అనే విమర్శలు వస్తున్నాయి. ఏ సీనియర్ హీరో, స్టార్ హీరో కూడా ఇలా నోరు జారి తమ సినిమాల విషయాలను చెప్పుకోరు. క్యూరియాసిటీ మెయింటైన్ చేసి సినిమాపై హైప్ పెంచుకుంటారు. కానీ చిరంజీవి అత్యుత్సాహం తనతో పాటు చరణ్ కు కూడా చేటు చేస్తోంది. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ విషయంలో ఇలానే నోరు జారాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. మరి.. చరణ్, కొరటాల కలిసి చిరంజీవిని ఎలా కట్టడి చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: