చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ నూటికి 80 శాతం గ్లామర్ పాత్రలకి, ఎక్స్‌పోజింగ్ పాత్రలకే ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మిగ శాతం అంటే కీర్తి సురేష్, నిత్యా మీనన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి పాత్రలకి సై అనడం లేదు. అయితే మేకర్స్ అలాంటి పాత్రల్లో నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రేక్షకులు కూడా వీళ్ళని గ్లామర్ పాత్రల్లో చూడాటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అలాంటి ఆఫర్స్ ని వదులుకుంటున్నారు గాని ఒప్పుకోవడం లేదు. 

 

ఇక ఈ మధ్య కాలంలో కొన్ని రకాల పాత్రలని మాత్రం అందరూ చేయడానికి ముందుకొస్తున్నారు. వాటిలో ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అలాగే లేడి విలన్ పాత్రలు. హీరోయిన్ రెజీనా "ఎవ‌రు" సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలు రావు అనికున్న సమయంలో ఎవరు లాంటి సినిమాతో కం బ్యాక్ అయింది. ప్రస్తుతం మరో సినిమాలో రెజీనా నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఏకంగా చిరు తో కలిసి స్టెప్పులేసింది. ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. 

 

ఇక నెగిటివ్ రోల్ లో నటిస్తోంది హీరోయిన్ అదితిరావ్ హైద‌రీ. నాని, సుధీర్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన "వి" సినిమాలో అదితి రావ్ హైద‌రీ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అదితి హీరోయిన్ గా న‌టిస్తున్నారు. "వి" సినిమాలో నాని విలన్ గా న‌టిస్తున్నాడు. నాని స‌ర‌స‌న అదితి కూడా నెగిటివ్ రోల్ పోషిస్తుందట. మ‌రో వైపు సుధీర్‌, నివేదా థామ‌స్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాను దిల్‌రాజ్ నిర్మిస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా గ‌త నెల 25న సినిమా విడుద‌ల చేచేఅల్సిన ఈ సినిమాని క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: