టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా మార్కెట్ పెరుగుతున్న నేపధ్యంలో స్టార్ హీరోలు అందరూ కూడా నిర్మాతలు అయ్యే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలు చాలా మంది ఇప్పుడు నిర్మాణ సంస్థలను రెడీ చేసుకుని సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా మార్కెట్ భారీ గా ఉన్న నేపధ్యంలో సినిమాలు చేయడానికి ముందుకి వస్తున్నారు హీరోలు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. మెగా హీరోలు ఈ మధ్య నిర్మాణ రంగం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీనితో చిరంజీవి వాళ్ళను ఓ కంట కనిపెడుతున్నారు. 

 

రామ్ చరణ్ నిర్మాతగా దాదాపుగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆయన ఎవరి తో సినిమా చేస్తారు అనేది స్పష్టత రాలేదు. దీనితో ఆయన చేసే సినిమాను ఇప్పుడు చిరంజీవి ఫైనల్ చేసినట్టు సమాచారం. ఒక అగ్ర దర్శకుడ్ని చిరంజీవి లైన్ లో పెట్టి ఆయనే నిర్మాతగా వ్యవహరించాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట. 

 

అన్నీ అనుకున్నట్టు జరిగి రామ్ చరణ్ ఓకే చెప్తే ఈ సినిమాను తాను పూర్తి చేయడానికి చిరంజీవి ఇప్పటికే రెడీ అయి రామ్ చరణ్ కి కూడా కథ ను వినిపించారు అంటున్నారు. రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా తర్వాత్ అతను చేసే సినిమా మీద స్పష్టత లేదు కాబట్టే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రకటించే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: