అక్కినేని వారసుడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయనతో పాటు సినిమాలు చేస్తున్న అందరు యంగ్ హీరోలు సక్సెస్ లు కొడుతుంటే .. అఖిల్ మాత్రం అసలు అదెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.  అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అఖిల్.. స్టార్ కిడ్ గా చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకూ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఫస్ట్ సినిమా అఖిల్.. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి అట్టర్ ఫ్లాప్ అయింది.
 
ఇలా కాదని సెకండ్ మూవీ హలో..విక్రమ్ కుమార్ డైరెక్షన్లో .. లవ్ స్టోరీ ట్రై చేశాడు.  ఆ సినిమా మిక్స్ డ్ టాక్ వచ్చినా హిట్ వరకూ రాలేకపోయింది. తర్వాత వచ్చిన  మిస్టర్ మజ్ను కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఇలా ఏ జానర్ లో తీసినా.. ఎలా తీసినా అఖిల్ ఇప్పటి వరకూ ఒక్క హిట్ బోణీ  కూడా కొట్టలేదు.  కానీ అఖిల్ తో పాటు సినిమాలు చేస్తున్న శర్వానంద్, నిఖిల్, నితిన్ మాత్రం ఎలా గొలా సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు.

 

లాస్ట్ ఇయర్ మిస్టర్ మజ్ను సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో తన 4 వ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా స్టార్ట్ అయిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అఖిల్ ఆశలన్నీ.. ఇప్పుడు తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మీదనే. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని అకౌంట్ లో వేసు కున్న అఖిల్ ఈ సినిమాతో హిట్ గట్టెక్కాలని భావిస్తున్నాడు.

 

అయితే జెట్ స్పీడుతో సినిమాను పూర్తి చేస్తున్న అఖిల్ జోరుకు కరోనా బ్రేక్ వేసింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన చిత్రయూనిట్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా ప్రభావం తగ్గినా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి. తెరుచుకున్నా ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్‌కు ఆశించిన హిట్ దక్కుతుందా..? వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: