ప్రస్తుతం లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లలోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులపై కసరత్తు ప్రారంభించారు. షూటింగ్‌లో ఉన్న సినిమాలు నిలిచిపోవడంతో భవిష్యత్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ హీరో, ఏ డైరెక్టర్‌తో ఏ సినిమా చేయనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అతడు', 'ఖలేజా`' సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. పదేళ్ల క్రింద వచ్చిన 'ఖలేజా' తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయని, అందుకే కలిసి పనిచేయడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవల మహేష్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరరు’, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురములో’ రెండూ బిగ్గెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టి మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నదని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొట్టింది. 

 

అయితే ఇప్పుడు తాజాగా మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ సినిమా గురించి వచ్చిన రూమర్ ఇవి బేస్ లెస్ రూమర్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుందని.. దీనికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపైనే ఉందని, ఈ సినిమాలో తారక్ ని స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్ రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: