టాలీవుడ్ లో ఇప్పటి రేసు గుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి లాంటి మూవీస్ తో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సురేందర్ రెడ్డి.  టాలీవుడ్ లో మెగా హీరోలతో సినిమాలు తీయడం అంటే కత్తిమీద సాములాంటిది అని తెలిసిందే.  అయితే ఈ యంగ్ డైరెక్టర్ మూడు సినిమాలు మెగా హీరోలతో తీశారు.  రేసు గుర్రం, ధృవ మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాయి.   తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మూవీ `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

 

 

అయితే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన  సైరా తెలుగు లో పరవాలేదు అనిపించుకున్నా ఇతర భాషల్లో దెబ్బతిన్నది.  అయితే ఈ సినిమా త‌రువాత ఆయ‌న ఎవ‌రితో సినిమా చేయ‌బోతుతున్నారు? .. ఆ హీరో ఎవ‌రు? అన్న‌ది ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది. సురేందర్ రెడ్డి అంటే  కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాలు కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా మంచి వర్క ఔట్ అయ్యేలా చూస్తారు.  మరి ఈ డైరెక్టర్ తదుపని మూవీ ఎవరితో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

 

ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న సురేంద‌ర్‌రెడ్డి ప్ర‌స్తుతం ఓ యంగ్ హీరోకు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడ‌ని తెలిసింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు అఖిల్ అక్కినేని. ఇప్ప‌టికే అఖిల్‌కి లైన్ వినిపించార‌ని, `రేసుగుర్రం` త‌ర‌హాలో ఈ సినిమా వుంటుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. మరి ఇప్పటి వరకు సరైన హిట్ లేక నానా అవస్థలు పడుతున్న అఖిల్ కి సురేందర్ రెడ్డి మంచి హిట్ ఇస్తారా.. సాదార‌ణంగా ఒక‌రు సిద్ధం చేసిన క‌థ‌కి స్క్రీన్‌ప్లేని అందించ‌డం సురేంద‌ర్‌రెడ్డి కి అల‌వాటు.. కానీ తొలిసారి ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ రాస్తున్నాడ‌ట‌. మరి ఎంత వరకు నిజమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: