పరాజయాల పరంపర కొనసాగిస్తున్నా కూడా మాస్ రాజా రవితేజ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. అందులో రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తో సినిమా కూడా వుంది.  కరోనా లేకుంటే ఈపాటికి ఈ చిత్రం సెట్స్ మీదకు వచ్చేదే. ఇక ఈ సినిమా ,కోలీవుడ్ మూవీ శతురంగ వెట్టై 2 స్ఫూర్తి తో తెరకెక్కనుందని తెలుస్తుంది. వినోత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, త్రిష జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణం గా థియేటర్ల లో విడుదలకాలేదు.
 
ఇక గత ఏడాది ఈసినిమాను చూసిన రమేష్ వర్మ, వినోత్ రైటింగ్ కు ఫిదా అయ్యి ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్నాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను తీసుకొని మరికొన్ని సీన్లను కలుపుకుని తెలుగు నేటివిటీ కి దగ్గర గా  కథను రెడీ చేసి రవితేజకు వినిపించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. రాక్షసుడు నిర్మాతలు  సత్యనారాయణ కోనేరు , హవీష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా రమేష్ వర్మతో రవితేజ కు ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబో లో తెరకెక్కిన వీర డిజాస్టర్ అయ్యింది. 
 
ప్రస్తుతం రవితేజ , గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ లో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్  పాత్రలో కనిపించనుండగా ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే మే 8న విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడనుంది. జూలై లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: