డార్లింగ్ హీరో ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. గత ఏడాది ఆయన భీర బడ్జెట్ సాహో చిత్రంలో నటించారు కానీ ఆశించినంత హిట్ మాత్రం కాలేదు ఆ చిత్రం. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో నటించాడు. ఆ మూవీ ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. దీనితో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం ఆయన krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ లో చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే ప్రభాస్ చాలా రోజుల తర్వాత కొంచం రొమాంటిక్ మరియు లవ్ స్టోరీలో నటిస్తున్నట్లు సమాచారం. ఐతే సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతున్న ఈ మూవీలో కాస్త ఎమోషన్ డోస్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్, పూజల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఇక పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకును బాగా కంట తడిపెట్టించడం ఖాయం అని అంటున్నారు. ప్రభాస్ డార్లింగ్ చిత్రం తరువాత ఓ పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ తీస్తున్నారు. యాక్షన్ పాళ్ళు ఉన్నప్పటికీ ఎమోషన్స్ పీక్స్ మాత్రం అట ఈ చిత్రంలో అయితే ప్రభాస్ ఏ విధంగా ఉండబోతున్నారు. అలాగే ఆయన లుక్ మీద కూడా ఫ్యాన్స్కి చాలా అనుమానాలు ఉన్నాయి. అవేమిటన్నది ఒక పోస్టర్ రిలీజ్ అయితేగాని చెప్పలేం అంటున్నారు. అందుకోసం ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.