మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరొక స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్న చరణ్, ఆ సినిమాలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్, తెలంగాణ పోరాట వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. వాస్తవానికి తన గత చిత్రం వినయవిధేయ రామ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకుని తన ఫ్యాన్స్ ని ఎంతో నిరాశపరిచిన చరణ్ కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కెరీర్ పరంగా ఎంతో కీలకం అనే చెప్పాలి. 

 

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం కొన్నిరోజులపాటు లాకౌట్ ప్రకటించడంతో తన ఫ్యామిలీతో కలిసి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు చరణ్. ఇక ఇటీవల తన బర్త్ డే ని ఎంతో ఘనంగా జరుపుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొద్దిరోజుల క్రితం ఒక వీడియో బైట్ ద్వారా తన సహచర నటుడు ఎన్టీఆర్ తో కలిసి ఈ కరోనాని ఎదుర్కోవడానికి ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఒక వీడియో ద్వారా, ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే ఉండాలని, దగ్గు, తుమ్ము వచ్చినపుడు తమ చేతిని మోచేతివరకు అడ్డంపెట్టుకోవాలని సూచనలు చేయడం జరిగింది. ఇక ఇటీవల తన తండ్రి తో పాటు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అఫీషియల్ అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్, నేటితో ఏకంగా 3 లక్షల ఫాలోవర్లను అందుకున్నారు. 

 

మొత్తంగా చరణ్ అకౌంట్ ఓపెన్ చేసి కేవలం 16 రోజులు మాత్రమే అయిందని, అయితే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతమంది ఫాలోవర్లను దక్కించుకోవడం కూడా ఒక గొప్ప రికార్డు అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. వాస్తవానికి అంతకముందు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో మాత్రమే అకౌంట్స్ కలిగి ఉన్న చరణ్, వాటితో పాటు ట్విట్టర్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేయడం ఎంతో ఆనందముగా ఉందని, దీని ద్వారా ఫ్యాన్స్ కి మరింతగా చేరువయ్యే అవకాశం దొరికిందని ఇటీవల చెప్పడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: