టాలీవుడ్ లో కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ అనగానే హిట్ ఫార్ములా అనే టాక్ వినపడుతూ ఉంటాయి. టాలీవుడ్ జనాలకు ఈ కాంబినేషన్ బాగా దగ్గరైంది. శ్రీమంతుడు సినిమా తర్వాత ఈ జోడికి మార్కెట్ భారీగా పెరిగింది. భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు చేసిన రోల్, ఆ పాత్రకు ఇప్పటికి ప్రాధాన్యత ఉండటం వంటివి టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ జోడీ ని బాగా దగ్గర చేసింది అనే చెప్పాలి. అందుకే ఈ జోడి మళ్ళీ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు కొరటాల. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ఎలా అయినా సరే ఈ ఏడాది విడుదల చెయ్యాలి అని భావించినా సరే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడటం ఖాయంగా కనపడుతుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత కొరటాల ఎవరి తో సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నా సరే అది సాధ్యం కాలేదు, ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. పరుశురాం తో చేసే సినిమా తో పాటుగా దీనిని కూడా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన మహేష్ బాబు చేస్తున్నాడు అంటున్నారు. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా ఈ లోపు ఆచార్య సినిమా అయితేనే. లేకపోతే ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. కథ ఎప్పుడో ఆయన రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: