హీరో హీరోయిన్ కలిసి సినిమా చేస్తే ఆ మూవీ హిట్ అయితే వాళ్ళ జోడికి మంచి క్రేజ్ ఉంటుంది. అయితే జంట బాగుండి సినిమా ప్లాప్ అయితే మాత్రం మళ్ళీ ఆ ఇద్దరు కలిసి చేస్తే అదే నెగటివ్ సెంటిమెంట్ తో చూస్తారు. అయితే ఈ సెంటిమెంట్ కు బ్రేక్ వేయాలని చూస్తున్నారు ఒక యువ జంట.  యువ హీరో శర్వానంద్, క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కలిసి ఇంతకుముందు పడి పడి లేచే మనసు సినిమా చేశారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇద్దరి జోడీ బాగుందని అనిపించినా సినిమా వర్క్ అవుట్ అవలేదు.

 

అయితే మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో మహా సముద్రం సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి నటిస్తున్నారని తెలుస్తుంది. నాగ చైతన్య, సమంత చేయాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాళ్ళు తప్పుకోవడంతో శర్వానంద్ చేతికి వచ్చింది. చైతు చేయకపోవడంతో సమంత కూడా సినిమా నుండి తప్పుకుంది. ఫైనల్ గా ఆ సినిమాలో శర్వా, సాయి పల్లవి జోడి ఫిక్స్ అయ్యింది. 

 

పడి పడి లేచే మనసు సినిమా ప్లాప్ అయినా కూడా ఈ ఇద్దరు  మళ్ళీ జోడి కడుతున్న ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. మహా సముద్రం దాదాపు రెండేళ్లుగా కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరిగిన అజయ్ భూపతి సినిమా తీసి హిట్టు కొట్టి తన కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. పడి పడి లేచే మనసు, జాను వరుస ప్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు ఈ సినిమా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి శర్వాతో అజయ్ భూపతి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. శర్వా సాయి పల్లవి ఆ సినిమాతో పడ్డారు ఈ సినిమా తో లేస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: