బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవ౦. ప్రభాస్ తో సినిమా చేయడానికి అప్పటి నుంచి కూడా ఎందరో దర్శకులు పోటీ పడుతూ వచ్చారు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేయడం, అగ్ర దర్శకులే అనే కాకుండా సినిమాకు మంచి రేంజ్ ఉంటే సినిమాను చేయడం వంటివి చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా మీద ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే అంచనాలను ఈ సినిమా అందుకోలేదు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కాస్త పూర్తి కాగా సినిమాను వాయిదా వేసారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా అపడింది. సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను ప్లాన్ చేసారు. మరి ఏమైందో ఏమో మళ్ళీ ఈ సినిమాను తెలుగుకు మాత్రమే పరిమితం చేసారు. ఇక ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. 

 

ఒక కథ రెడీ గా ఉందని అందులో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటించే అవకాశం ఉందని సమాచారం. కథ బాగా నచ్చడం తో ఆ సినిమాను ఒప్పుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కథ బాగా నచ్చడం తోనే ప్రభాస్ కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: