కరోనా వల్ల స్టార్స్ అంటా తమ ఇళ్లకే పరిమితమవడం.. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే స్టార్స్ ఒక్కసారిగా ఇంట్లో ఖాళీగా కనబడేసరికి వారి పిల్లలకు చాలా సంతోషంగా ఉందని చెప్పొచ్చు. సినిమాల షూటింగ్స్ తో క్యాలెండర్ మొత్తం ఫుల్ బిజీగా ఉండే సిని స్టార్స్ ఇలా మూడు వారాల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా ఈ టైం ను తమ పిల్లలకు పూర్తిగా అంకితం ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ తన కూతురు సీతారాతో ఆటలాడుతున్నాడు. ఒక సినిమా తర్వాత మరో సినిమా. కథ విన్న దగ్గర నుండి షూటింగ్ చేయడం.. డబ్బింగ్ చెప్పడం.. ప్రమోషన్స్ చేయడం.. రిలీజ్ అవడం.. ఆ తర్వాత సక్సెస్ మీట్ ఇలా సినిమా స్టార్ట్ అయినా నాటి నుండి పూర్తయ్యే వరకు ఫుల్ బిజీ. అలంటి టైం లో పిల్లలను మిస్ అవుతుంటారు. అయితే ప్రస్తుతం క్వారెంటైన్ టైం లో ఆ కోరికలన్నీ తీర్చుకుంటున్నారు.
మహేష్ బాబు అయితే సీతారాతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడట. సితార ఒక్క నిమిషం కూడా మహేష్ ను వదిలిపెట్టి ఉండటం లేదట. లేటెస్ట్ గా ఇద్దరు సోఫాలో ఆడుకుంటున్న పిక్ ఒకటి షేర్ చేసింది నమ్రత.క్వారెంటైన్డ్ నైట్స్.. has it's own perks..ఇంట్లో ఉండటం సేఫ్ గా ఉండటమే అంటూ కామెంట్ పెట్టారు నమ్రత. మహేష్ ఫ్యామిలీ మెన్ అని తెలుసు ఇప్పుడు మరింత ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ కంప్లీట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తున్న మహేష్ ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారని తెలుస్తుంది.