తెలుగు సినిమా పరిశ్రమకి ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది కీర్తి సురేష్. అయితే ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్న కీర్తి, ఆ తర్వాత బాగానే అవకాశాలు అందుకుని సినీ ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నాని తో నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాల్లో నటించిన కీర్తి సురేష్, ఆపై వైజయంతి మూవీస్ బ్యానర్ పై యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కీర్తి సురేష్ కి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చి పెట్టింది. 

 

ఇక ప్రస్తుతం మిస్ ఇండియా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది కీర్తి. ఇకపోతే గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి పై రకరకాల వార్తలు ప్రచారం అవుతూ అందరిలోనూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముందుగా ఒక బీజేపీ జాతీయ నాయకుడి కుమారుడితో ఆమె వివాహం నిశ్చయమైందని ఒక వార్త ప్రచారం అయింది, ఆ తర్వాత ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ఆమె వివాహం ఆల్మోస్ట్ కుదిరినట్లు మరొక వార్త ప్రచారం అయింది, అలానే ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారని, అతి త్వరలో అతనిని వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు రావడం జరిగింది. 

 

ఇక ఇటీవల ఏకంగా కోలీవుడ్  కమెడియన్ అయిన సతీష్ తో ఆమె వివాహం జరిగిపోయింది అంటూ ఒక సంచలన వార్త ప్రచారమైంది. ఈ విధంగా  కీర్తి సురేష్ వివాహం జరగబోతుంది, జరిగిందంటూ రోజుకొకరి పేర్లు బయటికి వస్తుండటంతో ఆమె అభిమానులు విపరీతంగా అనాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ, తనకు వివాహం కుదిరితే తప్పకుండా మీడియాకు, ప్రజలకు తెలియ పరుస్తాను అని చెప్పటం జరిగిందని, అలాంటప్పుడు రకరకాలుగా ఎవరెవరితోనో ఆమె పెళ్ళి నిశ్చయమైందని అంటూ ఈ విధంగా రకరకాలుగా తప్పుడు కథనాలు ప్రసారం చేయటం కరెక్ట్ కాదని ఆమె అభిమానులు అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: