యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా భాటియా హీరోయిన్స్ గా తెరకెక్కిన అత్యద్భుత చిత్ర రాజాలైన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా మంచి క్రేజ్ తో పాటు భారీ కలెక్షన్లు కూడా సంపాదించిన ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఇక ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి పేరు మరింత గొప్పగా మారుమ్రోగింది. ప్రస్తుతం అదే ఊపుతో తొలిసారిగా మెగా, నందమూరి హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. 

 

రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ముందుగా ఈ సినిమాని తీయాలని భావించి కథ సిద్ధం చేసిన అనంతరం, రాజమౌళి ఇంతటి భారీ ఖర్చును పెట్టగలం నిర్మాత ఎవరున్నారని కొంత ఆలోచన చేశారట. ఆ తర్వాత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్, అలానే సినిమా యూనిట్ అంతా కలిసి చర్చించిన అనంతరం దానయ్య గారిని కలవడం, ఆయన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని తీయాలని నిశ్చయించడం, ఆపై దానయ్య కూడా కథ విని ఎంతో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. 

 

అయితే ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు అని తెలియగానే, మీరు ఈ సినిమా నిర్మాణం నుంచి కనుక తప్పుకుంటే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని కొందరు నిర్మాతలు తనతో లాబీయింగ్ చేశారని, మరి కొందరైతే ఏకంగా వంద కోట్లు ఇస్తాము సినిమా మాకు వదిలేయండి అని కూడా అనటం జరిగిందట. అయితే ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తమ బ్యానర్ లో దర్శక దిగ్గజం రాజమౌళి గారి దర్శకత్వంలో ఒక సినిమాలో చేయాలన్న కోరికను తాను వదులుకోలేనని, అలానే డబ్బు కంటే కూడా తనకు ఒక గొప్ప దర్శకుడితో పని చేశానన్న ఆత్మసంతృప్తి చాలని వారికి చెప్పారట దానయ్య...!!

మరింత సమాచారం తెలుసుకోండి: