గత కొద్ది రోజులుగా మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో దేశ దేశాలన్నీ కూడా పూర్తిగా తమ ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల మధ్య సామాజిక దూరం తప్పనిసరిగా అవసరమని, దానివలన కరోనా వ్యాప్తి నిరోధానికి ఎంతో తొందరగా అడ్డుకట్ట వేయటానికి వీలవుతుందని భావించి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఇకపోతే ఇలా మన దేశాన్ని లాకౌట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు, ఎక్కువగా టివి చూడడంతో పాటు నెట్ వినియోగాన్ని కూడా విపరీతంగా పెంచేశారు. 

 

అవకాశం ఉన్న మేరకు రకరకాల సినిమాలు చూడటం, షోలు చూడటం, టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు చూస్తూ ఎవరికి వారు తమ ఇంట్లో కాలక్షేపంగా గడుపుతున్నారు. ఇక ఈ సమయంలో ఏ విధమైన కార్యక్రమం ప్రసారం చేసినా కూడా విపరీతంగా టిఆర్పి రేటింగ్స్ వస్తాయని భావించిన పలు టెలివిజన్ ఛానల్స్ వారు, ఎప్పటికప్పుడు మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాములు టెలికాస్ట్ చేయటంలో ఎవరికి వారు ఒకింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమాన్ని రేపటి నుండి పునః ప్రసారం చేయనున్నది స్టార్ మా టివి. 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్ట్ గా వ్యవహరించిన ఈ షో అప్పట్లో మంచి రేటింగ్స్ తో పాటు విపరీతమైన క్రేజ్ కూడా సంపాదించి అత్యద్భుతంగా ముందుకు సాగింది. నిజానికి లాకౌట్ ప్రకటించిన తర్వాత ముందుగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 ని ప్రసారం చేసిన స్టార్ మా వారు, దానికి బాగానే రేటింగ్స్ రావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఫస్ట్ సీజన్ ప్రసారం చేయాలని నిర్ణయించారట. మరి దీనికి ఎంత మేర రేటింగ్ వస్తుందో, ఏ విధంగా ప్రజాదరణ లభిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: