ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. అంటా సక్రమంగా ఉంటే ఈ నెలలో ఏఈ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగింది. ఇదే కాదు నాని వి సినిమా కూడా రిలీజ్ ఆపేశారు. ఈ రెండు సినిమాల గురించి ప్రస్తుతం మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. అమెజాన్ ఈ రెండు సినిమాలకు మంచి డీల్ ఇచ్చిందని అందుకే థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా అమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తారని ఒక ఆంగ్ల పత్రిక రాసుకొచ్చింది. 

 

ఈ వార్తలపై స్పందించాడు హీరో రామ్. తనకు ఎలాంటి అయోమయం లేదని.. పరిస్థితి అంటా చక్కబడ్డాకే సినిమా రిలీజ్ చేస్తామని.. సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన రామ్ తడమ్ లో కూడా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సూపర్ హిట్టన సబ్జెక్టు కాబట్టి సినిమా ఇక్కడ కూడా మంచి ఫలితాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. 

 

కిషోర్ తిరుమలలో రామ్ సినిమా అంటే డెఫినెట్ గా హిట్ అన్న పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ కాంబోలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. ఇక హ్యాట్రిక్ మూవీగా వస్తున్న తడమ్ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ ముగ్గురు హీరోయిన్స్ తో జోడీ కడుతున్నారు. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ లాంటి క్రేజీ హీరోయిన్స్ ఈ మూవీలో ఉన్నారు.మరి రామ్ కాన్ఫిడెంట్ చూస్తుంటే మరోసారి ఇస్మార్ట్ రేంజ్ హిట్ కొట్టేలా ఉన్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: