పెళ్ళిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతూ వర్మకి ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. పెళ్ళి చూపులు ఘన విజయం అదుకోవడంతో ఆఫర్లు వచ్చి పడతాయని భావించిన ఆమెకి నిరాశే మిగిలింది. నిఖిల్ తో కేశవ అనే సినిమా చేసినా అది అంత విజయం సాధించలేదు. దాంతో తెలుగులో ఆమెకి అవకాశాలే తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది.

 

అక్కడ ధనుష్ సరసన విఐపి 2 సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమెకి అక్కడ అవకాశాలు బాగానే ఉన్నాయట. మొన్నటికి మొన్న దుల్కర్ సల్మాన్ తో చేసిన తమిళ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి కనులు కనులను దోచాయంటే అన్న పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. అయితే తమిళంలో అవకాశాలు వస్తున్న రీతూ తెలుగులో కనిపించదా అనే ప్రశ్న కలిగింది.

 

దీనిపై రీతూ వర్మ స్పందించి తాను తెలుగులో చేయబోతున్న లిస్ట్ చెప్పింది. నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రంలో కనిపిస్తుందట. ఆ సినిమాలో రీతూ పాత్ర చాలా బాగుంటుందట. ఇప్పటికే కొన్ని సీన్ల చిత్రీకరణ కూడా జరిగిందట. ఇక రెండవ చిత్రం శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడితో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుందట.

 

మూడవది ఆగిపోయిందని వార్తలు వస్తున్న నాగశౌర్య హీరోగా నటిస్తున్నటి వంటి చిత్రం కూడా చేస్తుందట. లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలి దర్శకత్వంలో స్టార్ట్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా కథ నచ్చక నాగశౌర్య సినిమా చేయనన్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కావట. లాక్డౌన్  కారణంగానే ఈ సినిమా లాంఛింగ్ స్టార్ట్ కాలేదని, మొత్తం మూడు తెలుగు సినిమాలు తన చేతిలో ఉన్నాయని.. వీటివల్ల ఫ్యూఛర్ లో తాను తెలుగులో బిజీ అవుతానని అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: