పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే వరుసగా మూడు సినిమాలని ప్రకటించాడు. ఈ సంవత్సరం కనీసం రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని ఆశించారు. కానీ కరోనా కారణంగా వకీల్ సాబ్ మినహా మరే చిత్రం రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. 

 

 

పవన్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పాన్ ఇండియా రేంజ్ కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. పవన్ కెరీర్లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లు వార్తలొస్తున్నా అధికారికంగా రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ౨౮వ చిత్రాన్ని హరీష్ శంకర్ తో చేయనున్నాడు.

 

 

గబ్బరి సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి సినిమా చేస్తున్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ విజయం ఆయన అభిమానులకి ఎంతటి ఉత్సాహాని ఇచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ మళ్లీ గబ్బర్ సింగ్ స్థాయి హిట్ పడుతుందని భావిస్తున్నారు.

 

 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ తీసుకోవాలని చూస్తున్నారట. హరీష్ రాసుకున్న కథ ప్రకారం కాజల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కాజల్ ఈ సినిమాలో కూడా నటించనుందని అంటున్నారు.

 

ఇదే గనక నిజమైతే ఇప్పుడిప్పుడే అవకాశాలు తగ్గిపోతున్న కాజల్ కి మళ్ళీ అదృష్టం కలిసొచ్చినట్టే. అటు మెగాస్టార్ ఆచార్యలో నటిస్తున్న కాజల్, పవన్ కళ్యాణ్- హరీష్ సినిమాలో ఓకే అయితే మళ్ళీ స్టార్ స్టేటస్ అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: