దేశంలో ఇప్పుుడు కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ నిద్ర పట్టకుండా చేస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.  అయితే కరోనా ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలు షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే.  దాంతో వేల మంది రోడ్డున పడ్డారు.. అయితే సినీ సెలబ్రెటీలు అలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.  అన్ని సినీ పరిశ్రమల సెలబ్రెటీలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ 25 వేల మంది సినీ కార్మికుల అకౌంట్స్ లో డబ్బు వేసిన విషయం తెలిసిందే.

 

తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటి పట్టునే ఉంటున్నారు.. సరదాగా తన అల్లుడితో కలిసి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.   తన ఫామ్ హౌస్ లో గుర్రంపై రైడ్ చేస్తున్న ఫోటోలను అలాగే గుర్రానికి గడ్డి తినిపిస్తున్న వీడియోను షేర్ చేసి ‘బ్రేక్ ఫాస్ట్ విత్ మై లవ్’ అని తెలిపాడు. అయితే అందులో తన గుర్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఆకులను ముందు తాను తిని తరువాత గుర్రానికి తినిపించాడు సల్మాన్.

 

ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తున్నాడు సల్మాన్.  ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' అనే సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మధ్య వచ్చిన 'దబాంగ్ 3' బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతా ఆకట్టుకోలేకపోవడం తో  'రాధే' సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు సల్మాన్. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.  లాక్ డౌన్ సందర్భంగా అందరూ ఇంటి పట్టున ఉండాలని అంటున్నారు సల్మాన్ ఖాన్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: