సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ప్రస్థానం ఫేమ్ దేవకట్టా డైరెక్షన్ లో తన 14వ చిత్రంలో నటించాల్సి వుంది. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయ్యింది. కరోనా లేకుంటే ఈనెల 20 నుండే సెట్స్ మీదకు వెళ్ళేది కానీ ఈ మహ్మమారి విజృంభిస్తుండడం తో షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ కానుంది. అయితే ఇంతలోనే ఈసినిమా లో నటించే నటీనటులు వీరేనంటూ వారి పాత్రల తాలుకు వివరాలు కూడా  సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
 
దాంతో స్పందించిన చిత్ర నిర్మాతలు భగవాన్ ,పుల్లారావు.. ఈ సినిమా కు సంబంధించిన తారాగణం ఎంపిక లో వస్తున్న వార్తలు నమ్మొద్దు అవ్వన్నీ రూమర్స్ త్వరలోనే  నటీనటుల గురించి అధికారికంగా ప్రకటిస్తాం అలాగే కరోనా ప్రభావం తగ్గాక  షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ కు జోడిగా నివేత పేతురాజ్ నటించనుంది. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. 
 
ఇక గత ఏడాది చిత్ర లహరి, ప్రతి రోజు పండుగే తో సూపర్ హిట్లు కొట్టి ట్రాక్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మే 1న విడుదలకావాల్సి వుంది. కానీ కరోనా వల్ల ఆ  విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త  విడుదల తేదీని ప్రకటించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నాబా నటేష్ హీరోయిన్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా తో సాయి ధరమ్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: