లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఏవో అత్యసరమైన పనులు ఉంటేనే తప్ప బయటకు రావడానికి లేదు. కరోనాను తరిమికొట్టేందుకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ పద్ధతిని ఫాలో కావాల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే.. ఈ హాట్ మలంగ్ బ్యూటీ హోమ్ క్వారంటైన్ లో ఉండి ఇటివల మానవత్వంతో చేసిన పని అందరి మన్ననలు అందుకుంటోంది. దిశ ఈజ్ గ్రేట్ అంటున్నారు.

 

ఇటివల దిశ పటాని ఇంటికి సమీపంలో ఓ పక్షి (కైట్ జాతికి చెందిన) రోడ్డుపై పడిపోయి ఉంది. ఇది గమనించిన దిశ వెంటనే స్పందించింది. లాక్ డౌన్ అయినా సరే.. ధైర్యం చేసి వెళ్లి ఆ పక్షిని రక్షించింది. వెంటనే ఆ పక్షిని తీసుకుని ఓ వెటరినరీ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అక్కడే దానికి వైద్యం చేయించి కాపాడింది. దిశ చేసిన పని వైరల్ అయింది. దీంతో నెటిజన్లు దిశపై అభినందనలు కురిపిస్తున్నారు. నాకెందుకులే అని పట్టించుకోకుండా ఓ పక్షిని కాపాడావు అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ పిక్ లో దిశ ఫేస్ మాస్క్, చేతికి గ్లోవ్స్ వేసుకుని ఉంది. క్వారంటైన్ టైమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఫ్యాన్స్ కు చెప్పే దిశ తాను కూడా పాటిస్తోంది.

IHG

 

కెరీర్ పరంగా దిశ పటాని ఇటివల మోహిత్ సూరి తెరకెక్కించిన మలంగ్ లో నటించింది. ఈ సినిమాలో దిశ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్, ఆషిమా చిబ్బర్ దర్శకత్వంలో వస్తున్న కెటినా సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో పూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: