తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుకు  తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. డైలాగ్ డెలివేరిలో ఆయనది ప్రత్యేక స్టైల్. అందుకే ఆయన్ని డైలాగ్ కింగ్ అన్నారు. మోహన్ బాబు ఎన్నో హిట్ సినిమాలు చేశారు మరియు నిర్మించారు. కానీ మోహన్ బాబుకి ఇప్పుడు సక్సెస్ అందని ద్రాక్షలా మారింది.తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కులం మీద మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా కులాలు ఏమిటి ? ఉన్నవి రెండే కులాలు ఒకటి పాసిటివ్ రెండోవది నెగటివ్ . ఇప్పుడున్న  పరిస్థితుల్లో ఇంతకుమించిన కులం లేదన్నారు . మనుషులలో పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా ఇది అర్థం చేసుకుంటే చాలు. జీవితాంతం గొప్పగా ఉంటాడు. అది ఎవరైనా సరే. అది తెలుసుకోవడానికే వచ్చింది ఈ కరోనా' అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మోహన్ బాబు.

వారసత్వం గురించి అడుగగా ..వారసత్వం అనేది నాదృష్టిలో పదమే కానీ వేరేమీ కాదు. ఎవరి కడుపునా ఎవరు పుడతారో పైవాడు నిర్ణయించాడు కాబట్టి మనం పుడుతున్నాం. విష్ణు,మనోజ్ మరియు లక్ష్మి వారు నానుంచి రావాలని దేవుని నిర్ణయం అందుకే వచ్చారని .అదేవిధంగా తన వారసుల్లో ఎవరు సక్సెస్ అవుతారో చెప్పమన్నప్పుడు . ఎవడెక్కడ సక్సెస్ కావాలో అక్కడ సక్సెస్ అవుతాడని అన్నారు .ప్రస్తుతానికి విష్ణుకు బిసినెస్ అంటే ఇష్టం వాడు అందులో సక్సెస్ అవుతున్నాడు . మనోజ్ మరియు లక్ష్మి కి సినిమాల్లో ఇంట్రెస్ట్ కాబట్టి లక్ష్మి సినిమాల్లో సక్సెస్ అవుతుంది . అని మోహన్ బాబు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి: