సన్ గ్రూప్ కు చెందిన ప్రముఖ ఓటిటి సంస్థ సన్ నెక్స్ట్ గత కొంత కాలం నుండి కొత్త సినిమాలను వీలైన తొందరగా స్ట్రీమింగ్ లో ఉంచుతూ సబ్ స్క్రైబర్స్ ను భారీగా పెంచుకుంటుంది. తాజాగా ఇటీవల విడుదలైన మూడు తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. అందులో భాగంగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ను రేపటి నుండి స్ట్రీమింగ్ లో ఉంచనుండగా యంగ్ హీరో నాగ శౌర్య నటించిన అశ్వథ్థామ ఈనెల 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా ముహూర్తం ఖరారు చేసింది. సూపర్ హిట్ మూవీ భీష్మ ను కూడా స్ట్రీమింగ్ లోకి తీసుకరావడానికి రెడీ అయిపోయింది. ఈనెల 24నుండి భీష్మ ,సన్ నెక్స్ట్ లోకి అందుబాటులో రానుంది.
ఇక వరస పరాజయాల తో సతమతమైన
నితిన్ కు ఎట్టకేలకు భీష్మ సూపర్ హిట్ ఇచ్చింది.
ఫిబ్రవరి లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో 25కోట్ల వసూళ్లను రాబట్టింది.
వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో
రష్మిక కథానాయికగా నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రం తరువాత
నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రంగ్ దే.
తొలిప్రేమ ఫేమ్
వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. జూలై లో ఈ
సినిమా విడుదలకానుంది. ఈసినిమాను కూడా
సితార ఎంటర్ టైన్మెంట్సే నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటు
నితిన్,
చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో
చెక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.