రొమాంటిక్ క్యారెక్టర్ తో తెలుగునాట ప్రజలను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో హీరోగా అవతారం ఎత్తి అని అభిమానులను బాగానే అలరించాడు. తన కో ఫిమేల్ యాంకర్స్ లతో తాను నడిపించే కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చుతుంది. తాను వారికి లైన్ వేయడం కానీ వారేమో ఛీ కొట్టడం లాంటి కల్పిత హాస్యభరితమైన సన్నివేశాలు ఢీ, జబర్దస్త్ కామెడీ షో లకు ఎంతో రేటింగ్ తెచ్చిపెడుతున్నాయి.


ముఖ్యంగా ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే పోవే పోరా ప్రోగ్రామ్ లో సుధీర్, విష్ణు ప్రియా మధ్య చోటు చేసుకునే హాస్యభరితమైన రొమాంటిక్ సన్నివేశాలు బాగా పండుతాయి. రష్మీ తర్వాత సుడిగాలి సుధీర్ ఎక్కువగా స్టేజి పంచుకున్నది ఎవరితో అని అడిగితే... యాంకర్ విష్ణు ప్రియ అని ఎవరైనా చెబుతారు. అయితే తాజాగా ఆమె సుడిగాలి సుదీర్ పై చేసిన వ్యాఖ్యలు సుధీర అభిమానులను విస్తుపోయేలా చేస్తున్నాయి.


అసలు విషయం తెలుసుకుంటే... తాజాగా తను ఓ టీవీ ప్రోగ్రాం లో సుధీర్ తో పాటు పాల్గొని... సుధీర్ తనని చాలా కేరింగ్ గా చూసుకుంటాడని తన అమ్మ తర్వాత తనని ఇంత వరకు అంతా ఆప్యాయత తో ఏ ఒక్కరూ చూసుకో లేదని, తాను తనకి ఓ తండ్రి లాంటి వాడిని చెప్పి పే-ద్ద షాక్ ఇచ్చింది. దాంతో సుడిగాలి సుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడని తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సుధీర్ విష్ణు ప్రియా తో ఎలా రొమాన్స్ చేయగలడని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సుధీర్ కొద్దిసేపటి తర్వాత విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలను పాజిటివ్ గా సేకరించి సంతోషం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: