రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకోగా.. రామ్ చరణ్ కొరటాల శివ, చిరు డైరక్షన్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్, చరణ్ ల మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ లో ఈ ఇద్దరు స్టార్స్ నటిస్తున్నారు. 


రాజమౌళి సినిమాల్లో హీరోల వీరత్వం గురించి తెలిసిందే. అందులోనూ ఆర్.ఆర్.ఆర్ లో రియల్ హీరోస్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు ఈ హీరోలు. సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటిస్తారని తెలుస్తుంది. ఇక rrr తర్వాత మళ్ళీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక సినిమా ఉంటుందని టాక్. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా తర్వాత ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ సెట్స్ మీదకు తెస్తాడట. 

 

ఇప్పటికే అందరు దర్శకులు పాన్ ఇండియా సినిమాలతో తమ సత్తా చాటుతున్నారు. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాతో త్రివిక్రమ్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన త్రివిక్రమ్ రామ్ చరణ్ తో మాత్రం సినిమా చేయలేదు. ఎన్టీఆర్ తో అరవింద సమేత తర్వాత అయినను పోయి రావలె సినిమా చేస్తున్న త్రివిక్రమ్సినిమా తర్వాత మల్టీస్టారర్ తో అందరికి షాక్ ఇస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: