ఈ ఏడాది సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడ్డారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సినిమాతో సంక్రాంతి రేసులో దింపటం జరిగిందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే రెండు సినిమాలు పోటీపడినా తరుణంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో సినిమా సంక్రాంతి పండుగకు వచ్చిన అన్ని సినిమాల కంటే పైచేయి సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలవడం జరిగింది. 'అలా వైకుంఠపురం లో' సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా ‘అలా వైకుంఠపురం లో’ నిలిచింది. ఆ విధంగా మహేష్ పై పైచేయి సాధించాడు బన్నీ.

 

అయితే చాన్నాళ్ల తర్వాత మళ్లీ  ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఉగాది పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన తరుణంలో టెలివిజన్  ప్రేక్షకులు 'సరిలేరు నీకెవ్వరు' కి బ్రహ్మరథం పట్టారు. లాక్‌ డౌన్‌ ఇతరత్ర కారణాలతో సినిమాకు ఏకంగా 23.4 టీవీఆర్‌ రేటింగ్‌ను ఇచ్చారు. గత 15 ఏళ్లలో సినిమా కూడా ఈ స్థాయిలో టీవీఆర్‌ను దక్కించుకోలేదు అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మే ఒకటవ తారీఖున 'అలా వైకుంఠపురం లో' సినిమా ప్రపంచవ్యాప్తంగా టీవీ ప్రీమియర్ కు రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది.

 

ఇటీవలే మలయాళంలో ప్రీమియర్‌ అయిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కనుక ఇక తెలుగులో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. అల వైకుంఠపురంలో చిత్రం ప్రీమియర్‌ పాతిక నుండి 30 వరకు టీవీఆర్‌ దక్కించుకుంటుందని ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. దీంతో థియేటర్ నుంచి బయటకు వచ్చినా కానీ మహేష్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ 'అల వైకుంఠ పురంబులో' సినిమా బుల్లితెరపై కూడా విన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: